వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మృత్యుంజయం చర్య వెన్నుపోటు: కాంగ్రెస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఆదివారం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరడాన్ని వెన్నుపోటు చర్యగా కాంగ్రెస్‌ అభిప్రాయపడింది. కరీంనగర్‌ జిల్లాకు చెందిన మృత్యుంజయం 20 ఏళ్ళుగా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీలో పలు కీలకమైన బాధ్యతలను పోషించారు. అనేక పదవులను అనుభవించారు, అనుభవిస్తున్నారు.

కాంగ్రెస్‌ లో ఉంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడదని,అందుకే తె.రా.సలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించడంపై రాష్ట్రపీసీసీ కార్యదర్శి బొమ్మ వెంకటేశ్వర్లు హాస్యస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ వల్ల ఇప్పటికీ ఆయన పలు పదవులను అనుభవిస్తున్నాడని, వాటికి వెంటనే ఆయన రాజీనామా చేయాలని ఆయన సోమవారం డిమాండ్‌ చేశారు. మృత్యంజయం చర్యను ఆయన అవకాశవాద చర్యగాపీసీసీ అభివర్ణించింది. ప్రజలు ఆయనకు తగిన రీతిలో బుద్ది చెప్పుతారని వెంకటేశ్వర్లు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X