వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్లో ఊచకోత: ఆరుగరి హతం

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: కాశ్మీర్‌ లో మరోసారి తీవ్రవాదులు విరుచుకుపడ్డారు. ఒక కుటుంబంపై విరుచుకుపడి ఊచకోతకోశారు. రాజౌరి జిల్లా చౌహన్‌-కాట్‌ దారా గ్రామంలోని మహమ్మద్‌ గుజ్జార్‌ ఇంట్లోకి సోమవారం తెల్లవారఝామున తీవ్రవాదులు ప్రవేశించి, ఆ కుటుంబంలోని ఆరుగురిని హతమార్చారు. కుటుంబంలోని నలుగురుస్తీలు, ఇద్దరు పిల్లలపై వారు కిరాతకంగా కాల్పులు జరిపి హతమార్చారు.

ఆ కుటుంబానికి చెందిన ఓ సెక్యురిటీ సిబ్బంది కోసం తీవ్రవాదులు ఆ ఇంట్లోకి ప్రవేశించారు. అతను కన్పించకపోవడంతో ఇంట్లో ఉన్నస్త్రీలు కతూన్‌ బేగం (60), హనీఫా బేగం (30), జకీరా బేగం (29), తాజ్‌ బేగం్‌ (20)లతో పాటు, ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లలను ఇర్షాద్‌ అహ్మద్‌ (4), మరూఫ్‌ అహ్మాద్‌ (2) తీవ్రవాదులు కిరాతకంగా చంపివేశారు. తీవ్రవాదులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. చుట్టుపక్కల గ్రామాల్లో గస్తీని మరింతపెంచారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X