వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ ఆదర్శమిత్రపక్షం: బీజెపీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సంకీర్ణ ప్రభుత్వం ఉమ్మడి ఎజెండాకు కట్టుబడి ఉండే దేశంలోని ఏ పార్టీఅయినా, ఎన్డీఎ లో చేరవచ్చని భారతీయ జనతా పార్టీ తెలిపింది. మిత్రపక్షాలుగా ఫలానా పార్టీలనే తీసుకోవాలని రూలేమీ లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధివి.కె.మల్హోత్రా అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌ లో సంకీర్ణ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని సమాజ్‌ వాది పార్టీ తదితరవిఫక్షాలు చేస్తోన్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు.

సంకీర్ణ ప్రభుత్వాలకు కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ, బాగానే పనిచేస్తాయని, సమాజ్‌ వాది పార్టీ కూడా ఎన్డీఎలో చేరాలనుకుంటే బీజేపీకి అభ్యంతరం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ సహా ఏ మిత్రపక్షం ఎన్డీఏపై ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి అధికంగా నిధులు సంపాదించుకుంటున్నారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చేసినవిమర్శలు అర్ధరహితమన్నారు. టీడీపీ ఆదర్శవంతమైన మిత్రపక్షమని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X