వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్‌ పేయితో బిజెపి నేతల మంతనాలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌ పేయి తన మంత్రివర్గంలో భారీగా పునర్వ్యస్థీకరణ చేపట్టనున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన పార్టీసీనియర్‌ తో మంతనాలు జరిపి క్యాబినెట్‌ లో చేపట్టనున్న మార్పులను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు, ఉపప్రధాని ఎల్‌.కె.అద్వానీ, బిజెపి అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు న్యూఢిల్లీలో సోమవారం ఉదయం మంతనాలు జరిపారు.

ఎన్నికల కాలంలో పార్టీకి లాభం చేకూరేలా క్యాబినెట్‌ లో మార్పులు ఉండాలని ఇరువురూ స్థూలంగా అభిప్రాయానికొచ్చినట్లు తెలిసింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతాబెనర్జీతో పాటు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూఖ్‌ అబ్దుల్లా తిరిగి వాజ్‌పేయి క్యాబినెట్‌ లో చేరనున్నారు. అయితే, అరుణ్‌ శౌరీని ఐటి, కమ్యూనికేషన్‌ ల నుంచి తప్పించాలని పార్టీ అభిప్రాయంగా ఉంది.

ఈ విషయాన్ని వాజ్‌ పేయికి తెలిపిఅరుణ్‌ శౌరీని కేవలం పెట్టుబడుల ఉపసంహరణకు మాత్రమే పరిమితం చేయాలని అద్వానీ, వెంకయ్య భావిస్తున్నారు. సుష్మాస్వరాజ్‌ ను ఆరోగ్యశాఖ నుంచి శౌరీ శాఖనుఅప్పగించే అవకాశం ఉంది. అరుణ్‌ జైట్లీ తిరిగి పాత గూటికే - న్యాయశాఖకు- చేరే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రం క్యాబినెట్‌ లో మార్పులను ప్రకటిస్తారని తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X