వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దత్తాత్రేయ ఇక పార్టీకే పరిమితం?

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వాజ్‌ పేయి మంగళవారం చేపట్టనున్న క్యాబినెట్‌ మార్పులు, చేర్పుల్లో మన రాష్ట్రానికి చెందిన బండారు దత్త్రాత్రేయకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతంరైల్వేశాఖ సహాయమంత్రిగా పనిచేస్తోన్న దత్తాత్రేయకు ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడి బాధ్యతలుఅప్పగిస్తారని తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ శాఖలో పట్టు ఉన్న దత్తాత్రేయకు పార్టీ పగ్గాలు అప్పచెప్పితే బాగుంటుందని కొద్ది కాలంగా వెంకయ్యనాయుడుకు కార్యకర్తలు తెలియచేస్తున్నారు.

ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చిలకం రామచంద్రారెడ్డి నుంచి దత్తాత్రేయ బాధ్యతలుస్వీకరించే అవకాశం ఉంది. మంత్రిగా పూర్‌ మార్కులు సాధించిన దత్త్రాత్రేయ తిరిగి పార్టీ బాధ్యతలుస్వీకరించేందుకు కూడా సిద్దంగా ఉన్నారు. మంగళవారం ఒక టెలివిజన్‌ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో...పార్టీ కోరితే తిరిగి పార్టీ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్దమని స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X