వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు చేతుల మీదుగా సామూహిక వివాహాలు

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లాలో పెనుకొండ తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవీంద్ర ఆధ్వర్యంలో బుధవారం సామూహికవివాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యంమత్రి నారా చంద్రబాబునాయుడు హాజరవుతున్నారు.

బుధవారం ఉదయం పదకొండున్నర గంటలకు పసనకోటలోని దేవాలయ ప్రాంగణంలో ఈ సామూహికవివాహాలు జరుగుతాయి. 360 జంటలకు వివాహాలు జరిపిస్తారు. ఇదే సందర్భంలో భారీ రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.

ఇదిలా వుంటే, అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్‌ కక్షలు మరోసారి పడగవిప్పాయి. చిన్నకొండపల్లి గ్రామంలో హైదర్‌వలీ అనే వ్యక్తిని ప్రత్యర్థులు హత్య చేశారు. పసనకోటలోని సామూహికవివాహాల కార్యక్రమానికి బయలుదేరిన హైదర్‌వలీ బృందంపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో మరో ఆరుగురు గాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X