వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్ చేతిలో ఇద్దరి హత్య
హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు రాజకీయ పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులను నక్సలైట్లు హత్య చేశారు.
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం తాడ్వాయి గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు తిప్పిరెడ్డి శ్రీరాంరెడ్డిని నక్సలైట్లు హత్య చేశారు. పోలీసు ఇన్ఫార్మర్పేరుతో శ్రీరాంరెడ్డిని నక్సలైట్లు హత్య చేశారు. కడప జిల్లా మాధవరం గ్రామంలో బసిరెడ్డి అనే తెలుగుదేశం నాయకుడు బసిరెడ్డిని నక్సలైట్లు మంగళవారం తెల్లవారుజామున హత్య చేశారు. ఆయనను ఇంటి నుంచి వెలుపలికి పిలిచి కాల్చి చంపారు. అనంతరం ఆయన ఇంటిలోని ధాన్యాన్ని, ఇతర సామగ్రిని తీసికెళ్లారు. ఈ వ్యవహారమంతా రెండు గంటల పాటు సాగింది.
Comments
Story first published: Tuesday, May 20, 2003, 23:53 [IST]