వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పార్టీ నిర్ణయం శిరోధార్యం: దత్తాత్రేయ
హైదరాబాద్: పార్టీ నిర్ణయాన్ని తాను శిరసా వహిస్తానని రైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. పార్టీ రాష్ట్రాధ్యక్ష పదవి చేపట్టాలని పార్టీ ఆదేశిస్తే తాను శిరసా వహిస్తానని ఆయన చెప్పారు.
మూడేళ్ల పాటు రాష్ట్రాధ్యక్షుడిగా పని చేసిన చిలకం రామచంద్రారెడ్డి వీడ్కోలు సభ బుధవారం ఇక్కడ జరిగింది. మంత్రి పదవి ఇచ్చినందున తానుస్వీకరించానని, ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టాలని పార్టీ అడిగితేఅందుకు సిద్ధమేనని, ఈ విషయంలో తన వ్యక్తిగతాభిప్రాయానికి తావు లేదని దత్తాత్రేయ ఈ సందర్భంగా అన్నారు. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యుడైన నేతను రాష్ట్రాధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు పార్టీ నాయకులు చెప్పారు.
Comments
Story first published: Wednesday, May 21, 2003, 23:53 [IST]