వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అక్తర్పై రెండు మ్యాచ్ల నిషేధం
కొలంబో: బంతి ట్యాంపరింగ్ ఆరోపణపై పాకిస్థాన్ ఫాస్ట్ బౌలరు సోయబ్ అక్తర్పై రెండు మ్యాచుల నిషేధం విధించారు. మంగళవారం శ్రీలంకలో న్యూజిలాండ్తో జరిగిన వన్డే మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ మండలి రెఫరీ గుండప్ప విశ్వనాథ్ ఈ విషయం చెప్పారు.
అక్తర్ ఉద్దేశ పూర్వకంగా బంతి ఆకారం మార్చడానికి ప్రయత్నించాడని టెలివిజన్ రిప్లే ద్వారా ధృవీకరించుకున్న అనంతరం ఈ నిషేధం విధించారు. ఇక్కడ జరుగుతున్న ముక్కోణపు వన్డే పోటీల్లోఅక్తర్ పాకిస్థాన్ మ్యాచ్ గెలవడానికి తగిన బౌలింగ్ చేశాడు. కేవలం 36 పరుగులు ఇచ్చి మూడు న్యూజిలాండ్వికెట్లు తీసుకున్నాడు. దీంతో పాకిస్థాన్ ఫైనల్కు చేరుకుంది.
Comments
Story first published: Wednesday, May 21, 2003, 23:53 [IST]