వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్తర్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం

By Staff
|
Google Oneindia TeluguNews

కొలంబో: బంతి ట్యాంపరింగ్‌ ఆరోపణపై పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలరు సోయబ్‌ అక్తర్‌పై రెండు మ్యాచుల నిషేధం విధించారు. మంగళవారం శ్రీలంకలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి రెఫరీ గుండప్ప విశ్వనాథ్‌ ఈ విషయం చెప్పారు.

అక్తర్‌ ఉద్దేశ పూర్వకంగా బంతి ఆకారం మార్చడానికి ప్రయత్నించాడని టెలివిజన్‌ రిప్లే ద్వారా ధృవీకరించుకున్న అనంతరం ఈ నిషేధం విధించారు. ఇక్కడ జరుగుతున్న ముక్కోణపు వన్డే పోటీల్లోఅక్తర్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ గెలవడానికి తగిన బౌలింగ్‌ చేశాడు. కేవలం 36 పరుగులు ఇచ్చి మూడు న్యూజిలాండ్‌వికెట్లు తీసుకున్నాడు. దీంతో పాకిస్థాన్‌ ఫైనల్‌కు చేరుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X