సార్వత్రిక సమ్మెకు పాక్షిక స్పందన
హైదరాబాద్: ప్రభుత్వ విధానలకు నిరసనగా అఖిల భారతీయ కార్మిక సంఘం బుధవారం దేశవ్యాప్తంగాసార్వత్రిక సమ్మెను ప్రారంభించింది. బుధవారం ఉదయం ప్రారంభమైన ఈ ఒక్క రోజు సమ్మెకు పాక్షిక స్పందనే లభించింది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఈ సమ్మెకు స్పందన బాగానే లభిస్తున్నప్పటికీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో సమ్మె ప్రభావంస్వల్పంగా ఉంది.
అనేక చోట్ల బస్సులు యధావిధిగా నడుస్తున్నాయి. దుకాణాలు ఎప్పటిలాగే తెరుచుకున్నాయి. సాధారణ పౌరజీవితానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగుతోన్న ఈ సమ్మెకు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కార్మిక సంస్థలు దూరంగా ఉన్నాయి. బీమా, బ్యాంక్ ల ఉద్యోగులు మాత్రంస్వచ్చంధంగా పాల్గొన్నారు.
రాష్ట్రంలోనూ
పాక్షికమే..
రాష్ట్ర
రాజధాని
హైదరాబాద్
నగరంలో
కమ్యూనిస్ట్
పార్టీల
అధ్వర్యంలో
సమ్మె
జోరుగానే
సాగుతోంది.
అయితే,
బస్సుల
రాకపోకలు
మాత్రం
యధావిధిగానే
సాగుతున్నాయి.లెఫ్ట్
కార్యకర్తలు
అసెంబ్లీ
వద్ద
బస్సులను
ఆపేందుకు
ప్రయత్నించగా,
పోలీసులు
వారిపై
లాఠీ
ఛార్జీ
జరిపారు.సీపీఎం
రాష్ట్ర
కార్యదర్శి
బీవీ
రాఘవులు
మాత్రం
సమ్మెకు
విశేష
స్పందన
లభిస్తోందని
విలేకరులకు
చెప్పారు.
అందరూ
స్వచ్చంధంగా
పాల్గొంటున్నారన్నారు.