కోలుకుంటున్న వైయస్: సిఎం పరామర్శ
రాజమండ్రి: కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి పరిస్థితి క్రమంగా మెరుగవుతోంది. అనారోగ్యం కారణంగా ఆయన తన ప్రజాప్రస్థానం పాదయాత్రను తాత్కాలికంగా నిలిపే రాజమండ్రి సమీపంలో గల మధురాపురిలోని ఒక తోటలో విశ్రాంతి తీసుకుంటన్నవిషయం తెలిసిందే.
వైయస్ పూర్తిగా కోలుకోవడానికిఇంకా మూడు నాలుగు రోజులు పడుతుందని వైద్యులుచెప్పారు. రాజశేఖర్ రెడ్డి బుధవారం ఉదయంఉల్లాసంగా కనిపించారు. రాజీవ్గాంధీ వర్ధంతి సభలోఆయన పాల్గొన్నారు. ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతున్నప్పటికీనిరాశకు లోను కావద్దని ఆయన యువకులకుసూచించారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించినరక్తదాన శిబిరాన్ని ఆయన సందర్శించారు. తానుపాదయాత్రను తిరిగి ప్రారంభిస్తానని ఆయనపట్టుబడతున్నారు. అయితే అందుకు వైద్యులునిరాకరిస్తున్నారు.
ఇదిలా వుంటే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడురాజశేఖర్రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. రాజశేఖర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ముఖ్యమంత్రి అడిగితెలుసుకున్నారు. రాజశేకర్ రెడ్డిని పెద్ద యెత్తునకార్యకర్తలు పెద్ద యెత్తున వచ్చి పరామర్శిస్తున్నారు.