వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెండు ప్రమాదాలు- 9మంది మృతి
హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మండుగురు మరణించారు.
ఖమ్మం జిల్లా మణుగూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. బస్సు కూరగాయాల వ్యాపారులను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. అనంతపురం సమీపంలోని ఏడవ నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. లారీ డిసిఎం వ్యాన్ను ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. అదే మార్గంలో వస్తున్న లారీ ప్రమాదానికిగురైన లారీని ఢీకొనడంతో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
Comments
Story first published: Thursday, May 22, 2003, 23:53 [IST]