వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అల్జీరియాలో భూకంపం- 538 మంది మృతి
అల్జీర్స్: పెను భూకంపం ఉత్తర అల్జీరియాను అతలాకుతలం చేసింది. ఈ భూకంపానికి 538 మంది దాకా బలయ్యారు. దాదాపు 4,638 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకాపెరగవచ్చునని అధికార వర్గాలంటున్నాయి.
పెను భూకంపం తీవ్ర తాకిడికిగురైన బౌమెర్దీస్ జిల్లాకు అధ్యక్షుడు అబ్దులజీజ్ బైతెఫ్లికా హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. రాజధానికి 50 కిలోమీటర్ల దూరంలో గల ఈ ఒక్క జిల్లాలోనే 256 మంది దాకా మృత్యువాత పడ్డట్లు జాతీయ రేడియో ప్రకటించింది. అల్జీర్స్లోనూ, దాని చుట్టపక్కలా 200 మంది దాకా మరణించారు. కోస్తా తీర పట్టణం ఐన్ తయాలో 42 మంది మరణించారు.
ఇంకా భూమి అప్పుడప్పుడు కంపిస్తూనే ఉంది. భయంతో ప్రజలు రోడ్లమీదికి వచ్చారు. ఇళ్ల వెలుపలా, పార్కుల్లో పడిగాపులు కాస్తున్నారు. పాత భవంతులన్నీ కుప్పకూలిపోయాయి.
Comments
Story first published: Thursday, May 22, 2003, 23:53 [IST]