ఆంధ్రలో ఎండలకు 58 మంది బలి
హైదరాబాద్: రాష్ట్రంలో ఎండతీవ్రతకు, వడదెబ్బకు ఇప్పటి వరకు దాదాపు 58 మంది మరణించినట్లు సమాచారం. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా మున్నెడూ లేనివిధంగా ఎండలు కాస్తున్నాయి. వడగాలులువీస్తున్నాయి. మరణించివారికి రాష్ట్ర ప్రభుత్వం పది వేల రూపాయలేసిఎక్స్గ్రేషియా ప్రకటించింది.
మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి వుంటుందని హైదరాబాద్లోని వాతావరణపరిశోధన కార్యాలయం అధికారులు చెబుతున్నారు. దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు,కృష్ణా జిల్లాల్లో ఎండ తీవ్రత ప్రమాదకరంగా ఉండవచ్చునని అధికారులు హెచ్చరించారు. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తర కోస్తా ప్రాంతంలోస్వల్పంగా ఎండలు తగ్గవచ్చు. తెలంగాణలో ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. ఉత్తరాది నుంచి వడగాడ్పులు వీస్తుండడంతో రాష్ట్రం విలవిలలాడుతోంది.
విజయవాడలో గురువారంనాడు అత్యధికంగా 47.2 డిగ్రీలసెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జంటనగరాల్లో 43 డిగ్రీలసెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. ఒకటి రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో పగటిపూట పాదచారుల జాడ నామమాత్రమైంది. ప్రజలు పళ్లరసాలు, నిమ్మరసాలు, కొబ్బరి నీళ్లు తాగుతూ ఎండ తీవ్రతను తట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.