వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిశుమార్పిడి కేసులో బేగమ్‌ అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నయాపూల్‌ ప్రభుత్వాస్పత్రిలో శిశుమార్పిడి కేసులో మెహమూదా బేగంను చార్మినార్‌ పోలీసులు శుక్రవారంఅరెస్టు చేశారు. ఆడశిశువుకు బదులు మగశిశువును మెహమూదా బేగం తీసికెళ్లినవిషయం తెలిసిందే.

ఆమె నుంచి మగశిశువును తీసుకొని జంగారెడ్డి దంపతులకు పోలీసులు ఇప్పటికేఅప్పగించారు. ఈ కేసులో మెహమూదా బేగం భర్తతో పాటు నలుగురు ఆస్పత్రి ఉద్యోగులను పోలీసులు ఇంతకు ముందుఅరెస్టు చేశారు. ముగ్గురు ఆస్పత్రి ఉద్యోగులను ప్రభుత్వం డిస్మిస్‌ చేసింది.

మెహమూదా బేగంను పోలీసులు శుక్రవారంనాడు రెండో మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ముందుహాజరు పరిచారు. ఆమెకు మెజిస్ట్రేట్‌ 5 వేల రూపాయల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేశారు. అయితే ఈ సొమ్ము కట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మెహమూదా బేగంను జ్యుడిషియల్‌ కస్టడీకిపంపారు. శిశు మార్పిడి కేసుతో తనకు సంబంధం లేదని మెహమూదా బేగంఅంటోంది. పొరపాటంతా ఆస్పత్రి ఉద్యోగులదేనని ఆమె ఆరోపిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X