శిశుమార్పిడి కేసులో బేగమ్ అరెస్టు
హైదరాబాద్: హైదరాబాద్లోని నయాపూల్ ప్రభుత్వాస్పత్రిలో శిశుమార్పిడి కేసులో మెహమూదా బేగంను చార్మినార్ పోలీసులు శుక్రవారంఅరెస్టు చేశారు. ఆడశిశువుకు బదులు మగశిశువును మెహమూదా బేగం తీసికెళ్లినవిషయం తెలిసిందే.
ఆమె నుంచి మగశిశువును తీసుకొని జంగారెడ్డి దంపతులకు పోలీసులు ఇప్పటికేఅప్పగించారు. ఈ కేసులో మెహమూదా బేగం భర్తతో పాటు నలుగురు ఆస్పత్రి ఉద్యోగులను పోలీసులు ఇంతకు ముందుఅరెస్టు చేశారు. ముగ్గురు ఆస్పత్రి ఉద్యోగులను ప్రభుత్వం డిస్మిస్ చేసింది.
మెహమూదా బేగంను పోలీసులు శుక్రవారంనాడు రెండో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందుహాజరు పరిచారు. ఆమెకు మెజిస్ట్రేట్ 5 వేల రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ సొమ్ము కట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మెహమూదా బేగంను జ్యుడిషియల్ కస్టడీకిపంపారు. శిశు మార్పిడి కేసుతో తనకు సంబంధం లేదని మెహమూదా బేగంఅంటోంది. పొరపాటంతా ఆస్పత్రి ఉద్యోగులదేనని ఆమె ఆరోపిస్తోంది.