వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కడప జిల్లాలో నలుగురు నక్సల్స్ హతం
కడప: కడప జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురుపీపుల్స్వార్ నక్సలైట్లు హతమయ్యారు. కడప జిల్లాపెద్దకొండ అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
మరణించినవారిలో ముగ్గురు పురుషులతో పాటు ఒక మహిళ ఉంది. మహిళా నక్సలైట్ను పాపాగ్ని దళానికి చెందిన భారతక్కగా అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నాయకుడు బసిరెడ్డిని చంపింది ఈ నక్సలైట్లేనని పోలీసులుఅంటున్నారు. మరణించినవారిలో ఇద్దరు మఫ్టీలో ఉండగా ఇద్దరు ఆలీవ్ గ్రీన్ దుస్తులు ధరించి వున్నారు. సంఘటనా స్థలం నుంచి ఒక ఎకె 47రైఫిల్, ఒక 303 రైఫిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Story first published: Friday, May 23, 2003, 23:53 [IST]