వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కడప జిల్లాలో నలుగురు నక్సల్స్‌ హతం

By Staff
|
Google Oneindia TeluguNews

కడప: కడప జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురుపీపుల్స్‌వార్‌ నక్సలైట్లు హతమయ్యారు. కడప జిల్లాపెద్దకొండ అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

మరణించినవారిలో ముగ్గురు పురుషులతో పాటు ఒక మహిళ ఉంది. మహిళా నక్సలైట్‌ను పాపాగ్ని దళానికి చెందిన భారతక్కగా అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నాయకుడు బసిరెడ్డిని చంపింది ఈ నక్సలైట్లేనని పోలీసులుఅంటున్నారు. మరణించినవారిలో ఇద్దరు మఫ్టీలో ఉండగా ఇద్దరు ఆలీవ్‌ గ్రీన్‌ దుస్తులు ధరించి వున్నారు. సంఘటనా స్థలం నుంచి ఒక ఎకె 47రైఫిల్‌, ఒక 303 రైఫిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X