పాక్ తో ఇప్పుడిప్పుడే చర్చలు లేవు
చెన్నై: పాకిస్థాన్ తో వెంటనే భారత్ చర్చలు ప్రారంభించే అవకాశాలు లేవని రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ తెలిపారు. ఇప్పుడిప్పుడే చర్చలు ప్రారంభించబోమని ఆయన స్పష్టం చేశారు. భారత్, పాక్ ల మధ్యవిశ్వాసాన్ని పెంపొందించే చర్యలపైనే ప్రస్తుతం భారత్ ప్రధానంగా దృష్టి సారించిందని ఆయన శుక్రవారం చెన్నైలోవిలేకరులతో అన్నారు.
చర్చలు ప్రారంభించే సమయం ఆసన్నమైనప్పడు చర్చిస్తాం. కానీ సమీప భవిష్యత్ లో మాత్రం చర్చలు ఉండబోవుని కోస్ట్ గార్డ్ సిబ్బందికి ధైర్య, సాహస పతకాలనుఅందచేసిన అనంతరం ఆయన విలేకరులతో అన్నారు.పాకిస్థాన్ తీవ్రవాద నిరోధక చర్యలు కొన్ని చేపట్టింది. కొన్ని తీవ్రవాద సంస్థలకు తీవ్రవాద చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. ఈ చర్యలను కొంతమేరకు ఆహ్వానిస్తున్నప్పటికీ, ఇవి సంపూర్ణం కాదని పాకిస్థాన్ చేపట్టిన శాంతి ప్రయత్నాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే, పాకిస్తాన్ చేపట్టిన చర్యలు ఎంతవరకు అమలవుతాయో కూడాచెప్పలేమన్నారు.