వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంత్రి రామచంద్రన్ రాజీనామా?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జింజి ఎన్. రామచంద్రన్ రాజీనామా చేసేఅవకాశాలున్నాయి. తన పర్సనల్ అసిస్టెంట్ పెరుమాళ్లస్వామి లంచం తీసుకుంటూ పట్టుబడిన వ్యవహారంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితిలో పడ్డారనిఅంటున్నారు.
ఒక వేళ రాజీనామా చేయకపోతే శనివారం జరిగే మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణలో ఆయనకు ఉద్వాసన పలుకవచ్చునని భావిస్తున్నారు. రామచంద్రన్ పిఎపెరుమాళ్ల స్వామిని సిబిఐ అరెస్టు చేసింది. ఒక అధికారి బదిలీ కోసం ఆయన లంచం తీసుకున్నట్లు ఆరోపణ. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన చెన్నైకి చెందిన చార్టర్డ్అకౌంటెంట్ కృష్ణమూర్తిని కూడా అరెస్టు చేశారు.
చెన్నై నుంచి ఢిల్లీకి వచ్చిన రామచంద్రన్- తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, తన పిఎ లంచం తీసుకున్న వ్యవహారంతో తనకు ఏ సంబంధమూ లేదని అన్నారు.
Story first published: Friday, May 23, 2003, 23:53 [IST]