తృణమూల్ లేకుండానే కేబినెట్ విస్తరణ
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్కు ప్రాతినిధ్యం లేకుండానే ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శనివారం సాయంత్రం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ముగ్గురు కేబినెట్ మంత్రులుగాను, ఐదుగురు సహాయ మంత్రులుగాను ప్రమాణ స్వీకారం చేశారు. వీరి చేత రాష్ట్రపతి భవన్లోని అశోకా హాల్లో రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ ప్రమాణం చేయించారు.
ఇంతవరకు సహాయ మంత్రిగా ఉన్న బి.సి. ఖండూరీ కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. శివసేనకు చెందిన విఖే పాటిల్ స్థానంలో సుబోద్ మెహతే కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా కేబినెట్ మంత్రిగా వాజ్పేయి మంత్రివర్గంలో చేరారు.
స్వామి చిన్మయానంద, కైలేష్ మేఘమాల్, నాగ్మణి, ప్రహ్లాద్ సింగ్ పటేల్,పి.సి. థామస్ సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సరిగ్గా సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రమాణస్వీకారోత్సవం ప్రారంభమైంది. ప్రధాని అటల్బిహారీ వాజ్పేయితో పాటు ఆయన మంత్రి వర్గం సహచరులు ఎల్.కె. అద్వానీ తదితరులు ఈ కార్యక్రమానికిహాజరయ్యారు. ఉప రాష్ట్రపతి బైరాన్ సింగ్ షెకావత్, మాజీ ప్రధానిఐ.కె. గుజ్రాల్, బిజెపి అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు, తదితరులు మంత్వి వర్గ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు.