పోరు చేయండి: రైతులకు వైయస్ పిలుపు
రాజమండ్రి: సహకార రుణాలను బలవంతంగా వసూలు చేస్తున్న అధికారులపై ప్రజాస్వామిక పద్ధతిలో తిరుగుబాటు చేయాలని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. ఆయన శనివారం తూర్పు గోదావరి జిల్లాలోని బూరుగుపూడి, తదితర ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టారు.
సహకార బ్యాంకులు రైతుల నుంచి బలవంతంగా రుణాలు వసూలు చేస్తున్నాయని ఆయనవిమర్శించారు. కరువు ప్రాంతాల రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పది లక్షల రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారని ఆయనవిమర్శించారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నందుననే ప్రజలను మభ్యపెట్టడానికి ముఖ్యమంత్రి కోటి వరాల కార్యాచరణ ప్రణాళిక గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేరలేదని, మళ్లీ కొత్తగా హామీలు ఇచ్చి ప్రజలను మోసగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు.