వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమత ఢిల్లీ యాత్ర రద్దు

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: కేంద్ర మంత్రి వర్గంలో చేరుతారని భావించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మమతా బెనర్జీ తన ఢిల్లీ యాత్రను రద్దు చేసుకున్నారు. వెంటనే పార్టీ వర్కింగ్‌ కమిటీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

తన ఇష్టానికి భిన్నంగా తమ పార్టీసీనియర్‌ పార్టీ నాయకుడు సుదీప్‌ బందోపాధ్యాయను మంత్రి వర్గంలోకి తీసుకోనున్నారని వార్తలు రావడంతో ఆమె ఆ నిర్ణయం తీసుకున్నారు. పార్టీని సంప్రదించకుండా తమ పార్టీ పార్లమెంటు సభ్యుడ్ని మంత్రి వర్గంలో చేర్చుకోవాలనే నిర్ణయం సమంజసం కాదనిఅంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధాని వాజ్‌పేయికి ఒక లేఖను ఫ్యాక్స్‌ చేసింది. బందోపాధ్యాయను మంత్రి వర్గంలో చేర్చుకోవాలనే ప్రతిపాదన పట్ల మమతా అంతకు ముందు విముఖత వ్యక్తం చేశారు. ఆమెఅక్బర్‌ ఖాందోకర్‌ పేరును ప్రతిపాదించారు. బందోపాధ్యాయ గత ఐదు రోజులుగా ఢిల్లీలోనే వుంటున్నారు.

ఇదిలా వుంటే, తృణమూల్‌కు చెందిన ఎవరిని మంత్రి వర్గంలో చేర్చుకోవాలనేవిషయంపై గందరగోళం నెలకొనడంతో ప్రస్తుతానికి ఆ పార్టీకి మంత్రివర్గంలో చోటు కల్పించేవిషయాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. ఈ విషయమై ప్రధాని వాజ్‌పేయి తగిన సమయంలో మమతా బెనర్జీతో మాట్లాడుతారనిసీనియర్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత పంకజ్‌ బెనర్జీ చెప్పారు. తమ పరిమితుల గురించి కేంద్ర నాయకత్వానికి తెలియజేశామని ఆయన అన్నారు. ప్రమాణస్వీకారోత్సవంలో సుదీప్‌ బంధోపాధ్యాయ పాల్గొంటే ఏం చేస్తారని అడిగితే ఇది ఊహాజనితమైన ప్రశ్న అని, బంధోపాధ్యాయ అలా పాల్గొంటే ఏం చేయాలనేవిషయంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన జవాబిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X