వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎమ్మెస్సార్పై ప్రశంసల జల్లులు
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న ఎం. సత్యనారాయణ రావును పార్టీ నాయకులు ప్రశంసలతో ముంచెత్తారు. ఆయనను ఈ సందర్భంగా సన్మానించారు.
ఆయనకు ఆదివారంనాడు పూర్ణకుంభంతో పార్టీ కార్యాలయం గాంధీభవన్లోకిస్వాగతం పలికారు. వేదమంత్రాల మధ్య ఆయనను సన్మానించారు.విద్యుత్, చేనేత, వ్యవసాయ రంగాలపై ఎమ్మెస్సార్ ఉద్యమాలు నిర్మించి పార్టీని బలోపేతం చేశారని నాయకులు అన్నారు.
పిసిసి అధ్యక్షుడిగా ఎమ్మెస్సార్ పదవీకాలం ఉద్యమాల కాలమని తూర్పు గోదావరి జిల్లా పాదయాత్రలో ఉన్న సిఎల్పి నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు.
Comments
Story first published: Sunday, May 25, 2003, 23:53 [IST]