వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రభుత్వం వల్లే ఈ దుస్థితి: వైయస్
రాజమండ్రి: రైతుల దుస్థితికి చంద్రబాబు ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. ఆయన ఆదివారం తన పాదయాత్రను తూర్పు గోదావరి జిల్లాలో సాగింది. ఆయన పాదయాత్ర సోమవారంనాడు వేయి కిలోమీటర్ల మైలు రాయి దాటుతుంది.
రైతుల, చేనేత కార్మికుల ఆత్మహత్యలకు పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఆయన అన్నారు. చేనేత రంగంతో పాటు ఇతర రంగాలు కూడా ప్రభుత్వ విధానాల వల్ల అధ్వాన్నస్థితికి చేరుకుంటున్నాయని ఆయన అన్నారు. వ్యవసాయ రంగం తర్వాత రాష్ట్రంలో ఎక్కువదెబ్బ తిన్నది చేనేత రంగమేనని ఆయన అన్నారు. ఆప్కో ప్రభుత్వం నీరు గారుస్తోందని ఆయనవిమర్శించారు. తమ ప్రభుత్వం హయాంలో ఆప్కో ఏడాదికి 120 కోట్ల రూపాయల వ్యాపారం చేసేదని, ఇప్పుడు 19 కోట్ల రూపాయల వ్యాపారం కూడా చేయడం లేదని ఆయన అన్నారు.
Comments
Story first published: Sunday, May 25, 2003, 23:53 [IST]