వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిజర్వేషన్లపై జాతీయ కమీషన్‌: బిజెపి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బ్రాహ్మణ, రాజపూత్‌, ఝాట్‌ వంటి అగ్ర కులాలు చేస్తున్న డిమాండ్లను దృష్టిలో వుంచుకుని రిజర్వేషన్లపై జాతీయ కమీషన్‌ను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ(బిజెపి) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాజ్యాంగ సవరణ ద్వారా ఇతర కులాలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉన్నదని బిజెపి అధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు అన్నారు.

అయితే తాము ఎస్‌సి,ఎస్‌టి, ఇతర వర్గాల రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, ఈ రిజర్వేషన్లకు భంగం కలుగకుండా అగ్రకులాలపేదలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. ఢిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీష్‌ఘడ్‌,మిజోరం ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేయడానికి జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రమోద్‌ మహాజన్‌ ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.కైలాష్‌ మిశ్రా స్థానంలో జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్‌ మరండీని పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించారు.కైలాష్‌ మిశ్రా గుజరాత్‌ గవర్నర్‌గా నియమితులైనవిషయం తెలిసిందే. రాజ్‌నాథ్‌ సింగ్‌ స్థానంలో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X