టీడీపీని ఏ శక్తి ఓడించలేదు: బాబు
తిరుపతి(మహానాడుప్రాంగణం): తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలోని ఏ శక్తిఓడించలేదనీ, ఏ వ్యక్తి పార్టీతో పోటీపడలేరని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుఅన్నారు. మహానాడు ప్రాంగణంలో ఆయన అధ్యక్షోపన్యాసం చేస్తూకాంగ్రెస్, టీఆర్ ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
తెలుగుదేశాన్ని ఓడించేందుకుకాంగ్రెస్ యాత్రలు చేపడుతోందని, వారికి ప్రజల సమస్యలు ఇప్పుడుగుర్తొచ్చాయని ఎద్దేవా చేశారు. పాదయాత్రలుకాంగ్రెస్ వారికి ఫ్యాన్సీగా మారిందన్నారు. కాంగ్రెస్ వారు ఎన్ని యాత్రలు చేసినా టీడీపీ జైత్రయాత్రను ఎవరుఅడ్డుకోలేరని ఆయన ధీమా వ్యక్తంచేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రసమితిపై ఆయనచురకలు విసిరారు. రాష్ట్రాన్ని చీల్చి లబ్ది పొందాలన్నదురాశతో టీఆర్ ఎస్ వ్యవహరిస్తోందని ఆయనవిమర్శించారు. కేసీఆర్ ఎన్ని సైకిల్ యాత్రలు చేపట్టినా టీడీపీసైకిల్ను దాటి ముందుకు వెళ్ళలేడనిఆయన అన్నారు.