కాంగ్రెస్ ను విమర్శించే సీన్ బాబుకు లేదు
రాజమండ్రి: మహానాడు తొలిరోజు ప్రసంగంలో సోనియాగాంధీ, కాంగ్రెస్ లపైవిమర్శలు గుప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపైసీఎల్పీ నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విరుచుకుపడ్డారు. సోనియాగాంధీనివిమర్శించే సీన్ చంద్రబాబుకు లేదన్నారు. బుధవారం తన ప్రజాప్రస్థానంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాల్లోని ఓ గ్రామంలో మధ్యలో ఆగి కాసేపువిలేకరులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అప్పుడే ఎన్నికల భయం పట్టుకొందని,అందుకే సంక్షేమ వరాలు గుప్పిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చైతన్యం చూసిఓర్వలేక, తమపై అర్ధరహిత విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బాబుపెద్ద షాక్ తింటారని ఆయన జోస్యం చెప్పారు. ప్రజల్లో బాబుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని వై.ఎస్ చెప్పారు.పరగోడు ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులపై బాబువిమర్శలు గుప్పించడం ఆయన అవివేకాన్ని తెలియచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలవిషయంలో ఏ కాంగ్రెస్ నాయకుడు రాజీపడడని ఆయన స్పష్టం చేశారు.