వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిత్రావతిపై ప్రాజెక్టు ఆపం: కృష్ణ
బెంగుళూర్: చిత్రావతి నదిపై ఆనకట్ట నిర్మాణాన్ని ఆపబోమని కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ చిత్రావతి నదిపై బాగేపల్లి వద్ద తలపెట్టిన ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతుందని ఆయన బుధవారంనాడు చెప్పారు.
ఈ ప్రాజెక్టును మంచినీటి సౌకర్యం కల్పించడానికే ఉద్దేశించామని ఆయన చెప్పారు. మంచినీటికి కేంద్ర ప్రభుత్వం గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ ప్రత్యామ్నాయం చూపిస్తే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపడానికి తమకు అభ్యంరం లేదని ఆయన అన్నారు.
కర్ణాటక ప్రభుత్వం వివిధ నదులపై ఆనకట్టలు నిర్మిస్తూ పోతుండడాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుపతిలో జరుగుతున్న మహానాడులో తీవ్రంగా ధ్వజమెత్తారు.
Comments
Story first published: Wednesday, May 28, 2003, 23:53 [IST]