వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెసూరా ప్రత్యేక సీమ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః వైఎస్‌ పాదయాత్రను కాపీకొట్టిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎంవి మైసూరారెడ్డి ఒక ప్రకటనతో రాయలసీమలో వేడి పుట్టించారు. ప్రత్యేక తెంలంగాణ ఏర్పడితే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ నెల19 నుంచి కరువు దండుపేరిట పాదయాత్ర ప్రారంభించిన ఆయన ఇప్పటి వరకు 140 కిలోమీటర్లు నడిచారు. ప్రత్యేక తెలంగాణా ఏర్పడే పరిస్ధితులు వస్తే వెంటనే ప్రత్యేక రాయలసీమ కోసం తాను ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ కంటే రాయలసీమ ఎక్కువ వెనుకబడి ఉందన్నారు. చిన్న రాష్ట్రాలఏర్పాటు కోసం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానం చేసినవిషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్‌ లో వైఎస్‌ కు చిరకాల ప్రత్యర్ధిఅయిన మైసూరా రెడ్డి వైఎస్‌ వ్యతిరేక వర్గంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా వైఎస్‌ ను ముఖ్యమంత్రిని కానివ్వకూడదని ఆయన పట్టుదలగా ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X