వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్టీఆర్ కు బాబు ఘననివాళి
తిరుపతి: దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు జన్మదినం పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆయనకు ఘనంగా నివాళులుఅర్పించారు. మహానాడు ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళిఅర్పించారు. ఎన్టీఆర్ ను ఆయన ఘనంగా కొనియాడారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎన్టీఆర్ గ్యాలరీని ఆయన ఆసక్తిగా తిలకించారు.
అంతకుముందు, తిరుపతి పట్టణంలో ఉన్న ఎన్టీఆర్విగ్రహాన్ని సందర్శించారు. ఇటు, హైదరాబాద్ లోనూ ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఎన్టీఆర్ ఘాటును సందర్శింది స్మరించుకున్నారు. ఎన్టీఆర్ కుమారులు హరికృష్ణ, జయకృష్ణ, మోహన కృష్ణ, మనవళ్ళు చైతన్యకృష్ణ, కళ్యాణ్ రామ్ లు ఎన్టీఆర్ ఘాట్ కు ఉదయాన్నేవిచ్చేసి పూలమాలలు సమర్పించారు. అనంతరం ఎన్టీఆర్ మరో మనవడు, హీరో ఎన్టీఆర్ జూనియర్ కూడావిచ్చేసి నివాళులు అర్పించారు.
Comments
Story first published: Wednesday, May 28, 2003, 23:53 [IST]