ఎస్సి, ఎస్టిలకు చంద్రబాబు వరాలు
తిరుపతి: ఎస్సి, ఎస్టిలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారంనాడు వరాల జల్లు కురిపించారు. తెలుగుదేశం మహానాడు చివరిరోజు ఆయన ఎస్సి, ఎస్టి, బిసీల గురించి మాట్లాడారు.
అట్టహాసంగా జరిగిన మహానాడు తిరుపతి డిక్లరేషన్తో గురువారంనాడు ముగిసింది. వ్యవసాయం, మహిళా సాధికారిత, సంపూర్ణ అక్ష్యరాస్యత, బలహీనవర్గాల సంక్షేమం, తదితరఅంశాలతో తెలుగుదేశం మహానాడు తిరుపతి డిక్లరేషన్ను ప్రకటించింది. వచ్చే మహానాడును హైదరాబాదులో నిర్వహించనున్నట్లు కూడా ప్రకటించింది.
ఎస్సి, ఎస్టిల కోసం కమీషన్ను ఏర్పాటు చేస్తామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం సాధిస్తామని ఆయన చెప్పారు. అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం తెలుగుదేశం లక్ష్యమని ఆయన చెప్పారు. 60 కోట్ల రూపాయలతో బిసి హాస్టల్స్ను ఏర్పాటు చేస్తామని, మరో 60 కోట్ల రూపాయలతో బిసీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, తెలుగుదేశం పార్టీకి బిసిలే వెన్నెముక అని, బిసిలను మర్చిపోతే తెలుగుదేశం తనను తాను మర్చిపోయినట్లేనని ఆయన అన్నారు.
తాము లౌకికవాదాన్ని కాపాడుతున్నట్లు తెలుగుదేశం రాజకీయ తీర్మానం స్పష్టం చేసింది. తీవ్రవాద సంస్థలను ప్రజలు వ్యతిరేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వంలో చేరకుండా తెలుగుదేశం కాపలాదారు పాత్ర నిర్వహిస్తోందని రాజకీయ తీర్మానంపై మాట్లాడిన వక్తలు అన్నారు.