బిజెపి జాతీయ సమావేశాలు ప్రారంభం
హైదరాబాద్: త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాలఅసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కార్యచరణ ప్రణాళికను చర్చించేందుకు సమావేశమైన భారతీయ జనతాపార్టీ జాతీయ సదస్సు గురువారం ఉదయం ప్రారంభమైంది. ఉపప్రధాని ఎల్.కె.అద్వానీతో పాటు బిజెపికి చెందిన జాతీయ స్థాయి నాయకులు పలువురుహాజరైన ఈ సమావేశాలు హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి.
అద్వానీ తొలుత ప్రసంగించి సమావేశాన్ని ప్రారంభించగా, అనంతరం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు ప్రసంగించినట్లు తెలుస్తోంది. మీడియాకు దూరంగా కేవలం పార్టీ నాయకుల మధ్యే మేధో చర్చ జరుగుతోంది.అసెంబ్లీ ఎన్నికలతో పాటు, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలను ఇక్కడ ప్రధానంగా చర్చిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలను ముందే నిర్వహించాలని దానిపై కూడా చర్చించబోతున్నారన్న వార్తలను వెంకయ్యనాయుడు ఖండించారు.అసలు ఆ అంశం మా ఎజెండాలోనే లేదు. సామాజిక, రాజకీయ ఫరిధినిపెంచుకుంటూ పార్టీని బలోపేతం చేయడంపైనే ఆయా రాష్ట్రాల పార్టీ కార్యదర్శులతో ఇక్కడ చర్చిస్తున్నామని ఆయన తెలిపారు.