వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిఎస్‌ పేల్చివేతకు వార్‌ విఫలయత్నం

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా మహదేవ్‌పూర్‌ పోలీసుస్టేషన్‌ను పేల్చివేయడానికి పీపుల్స్‌వార్‌ నక్సలైట్లువిఫలయత్నం చేశారు. శుక్రవారం తెల్లవారు జామున మూడున్నర నాలుగు గంటల ప్రాంతంలో బస్సులో వచ్చిన నక్సలైట్లు పోలీసుస్టేషన్‌ను పేల్చివేయడానికి ప్రయత్నించారు. ఈ సంఘటనలో ఒక కానిస్టేబుల్‌తో పాటు ఎనమండుగురు గాయపడ్డారు. ఈ సంఘటనలోపెద్దగా ఆస్తి నష్టం సంభవించలేదు.

సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి- సూరారం గ్రామానికి చెందిన కొంత మంది కొండగట్టు జాతరకు అద్దెకు తీసుకున్న ఆర్టీసి బస్సులో బయలుదేరారు.పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు మార్గమధ్యంలో ఈ బస్సును ఆపేసి బస్సు డ్రైవర్‌ను, కండక్టర్‌ను, ప్రయాణికులను దింపేసి బస్సును తీసికెళ్లారు. నక్సలైట్లు ఈ బస్సులో మందుగుండు సామగ్రిని నింపుకొని మహదేవ్‌పూర్‌ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ బస్సును ఆపేసి మందుగుండు సామగ్రితో పోలీసుస్టేషన్‌ను పేల్చేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ దాడిలో పోలీసుస్టేషన్‌కు పెద్దగా నష్టం జరగలేదు. అయితే కొన్ని ఇళ్లు, దుకాణాలుదెబ్బ తిన్నాయి. ఈ సంఘటనలో గాయపడిన కానిస్టేబుల్‌ సహదేవ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

నక్సలైట్ల కోసం స్పెషల్‌ పార్టీ పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కరీంనగర్‌మిలటరీ ప్లాటూన్‌ ఈ చర్యకు పాల్పడి వుంటుందని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X