బస్తీమే సవాల్ అంటే ఎలా?: బాబు
రాజమండ్రి: అభివృద్దిపై చర్చకు రావాలని తాను ఇచ్చిన పిలుపునకు కాంగ్రెస్ వక్రభాష్యం చెపుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడువిమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధిని, తెలుగుదేశం పాలనలో జరిగిన అభివృద్ధినిఅంచనాకు సిద్దం కావాలని మాత్రమే తాను మహానాడు వేదికపై వ్యాఖ్యానించినట్లు ముఖ్యమంత్రివివరణ ఇచ్చారు.
అంతేకానీ, రాష్ట్రంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు తాను డిమాండ్ చేయలేదని ఆయన రాజమండ్రిలో ఏర్పాటుచేసిన ఓవిలేకరుల సమావేశంలో అన్నారు. చర్చకు తాను సిద్దంఅంటూ వై.ఎస్ చేసిన సవాల్ బస్తీ మే సవాల్ ..రెడీ అన్నట్లుగా ఉందనీ, అలాంటి వీధి పోరాటాలకు నేను ఎలా వెళతాననీ బాబు నవ్వుతూ వ్యాఖ్యానించారు.
జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రంలో ఆయా కాలాల్లో జరుగుతోన్న అభివృద్ధిపై డాక్యుమెంట్లు లభ్యమవుతాయనీ, వాటిని పరిశీలిస్తే సరిపోతుందని కాంగ్రెస్ వారికి ఆయన సూచించారు. ప్రభుత్వ డాక్యుమెంట్లుతో పాటు ప్రైవేట్ సంస్థలు రూపొందించిన అభివృద్ధి సూచీల్లోనూ జాతీయ స్థాయిలో తామేటాప్ ఉన్నామని విషయం అందరికీ తెలుసన్నారు.