ఆసీస్ పై మరోసారి నెగ్గిన విండీస్
సెయింట్ జార్జి: వరుసగా నాలుగు వన్డేల్లో ఓటమిని చవిచూసిన లారా బృందం చివరి రెండు వన్డేల్లో మేల్కొంది. ఐదో వన్డేను చేజిక్కొంచుకున్న విండీస్ చివరి మ్యాచ్ లోనూవిజయం సాధించింది. వేహెల్ హిండ్స్ అద్భుతసెంచరీ సాధించడంతో వెస్టెండీస్ ఆసీస్ పై మూడువికెట్ల తేడాతో నెగ్గింది. ఆస్ట్రేలియా విధించిన 253 పరుగల లక్ష్యాన్నిచేధించే ప్రయత్నంలో విండీస్ తొలుత కంగారుపడివికెట్ల జారవిడుచుకొంది. ఓపెనర్ క్రిస్ గేల్స్, లారాలు త్వరగా ఔటయ్యారు.
తర్వాత వచ్చిన డిపెండబుల్ రమేష్శర్వాన్ హిండ్స్ కు తోడు ఇవ్వడంతో భారీ భాగస్వామ్యం నమోదైంది. ఇద్దరూ కలిసి 114 పరుగులు జోడించారు. 50 పరుగులు చేసిన అనంతరంశర్వాన్ బ్రెట్ లీ బౌలింగ్ లో ఔట్ కావడంతో మరోసారి విండీస్ కష్టాల్లో పడింది.
అయితే, మొక్కవోని ధైర్యంతో విండీస్ మొండిగా పాతుకుపోయి ఆట చివరి వరకు క్రీజ్ లో నిల్చొని విండీస్ ను గట్టెక్కించాడు. 125 పరుగులు సాధించిన హిండ్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఇప్పటికే ఆసీస్ 4-2తో సిరీస్ ను దక్కించుకొంది.