పానీకై రాజ్ భవన్ వెళ్ళిన కాంగ్రెస్
హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి కృష్ణాజలాలను వెంటనే తరలించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్పీనే కే లియే ఛలో రాజ్ భవన్ అని భారీ ర్యాలీ నిర్వహించింది. ఖాళీ కుండలతో రాజ్ భవన్ ఎదుట ప్రదర్శన నిర్వహించింది. శనివారం ఉదయం ఆబిడ్స్ వద్దపీసీసీ అధ్యక్షుడు ఎం.సత్యనారయణరావు ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ ఆబిడ్స్ నుంచి ఖైరతాబాద్మీదుగా రాజ్ భవన్ కు చేరుకొంది.
సీఎల్పీ మాజీ నేత పి.జనార్ధనరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ ముఖ్యనాయకులు ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరంవీరు గవర్నర్ సూర్జీత్ సింగ్ బర్నాలాను కలిసి వినతపత్రం సమర్పించారు. నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు వెంటనే కృష్ణా జలాలు తరలిస్తామని హామీలు గుప్పించిన ప్రభుత్వం వాటిని మర్చిపోయిందని వారువిమర్శించారు.
అసెంబ్లీలో కూడా జలాలపై కోతలు కోశారనీఅయినా ఇప్పటివరకు ఒక్క చుక్క నీరు కూడా నగర ప్రజల నోటికిఅందలేదని దెప్పిపొడిచారు. అంతకుముందు ఆబిడ్స్ లోపీసీసీ అధ్యక్షుడు ఎం.సత్యనారయణరావు మాట్లాడుతూ జంటనగరాలకు తాగు నీరుఅందించేందుకు తమ పార్టీ ఉద్యమాలు చేపడుతుందని ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే, భారీ ర్యాలీలు, ప్రదర్శనలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.