శతాబ్దపు తొలి సూర్యగ్రహణ వీక్షణం!
న్యూఢిల్లీ: ఈ శతాబ్దపు తొలి సూర్యగ్రహణం శనివారం ఉదయం సంభవించింది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లోనూ ప్రజలు గ్రహణాన్నివీక్షించారు. భక్తిశ్రద్దలతో పూజలు జరిపారు. న్యూఢిల్లీ, ఆగ్రా, జైపూర్, శ్రీనగర్ లలో ఉదయం ఏడున్నర గంటల నుంచి గంటసేపు సూర్యగ్రహణం కన్పించింది.
హర్యానాలోని కురుక్షేత్ర వద్ద వేలాది మంది భక్తులు సన్నిహిత్,బ్రహ్మ్ సరస్సుల్లో అభ్యంగన స్నానమాచరించారు. వేలాదిగా భక్తులు ఇక్కడికి తరలిరావడంతో వారి అదుపులో ఉంచడం పోలీసులకు సవాల్ గా మారింది. గ్రహణం రోజున రెండు నదుల్లో గానీ,సరస్సులలోగానీ మునిగి స్నానమాచరించి సూర్యనమస్కారం చేస్తే మోక్షం కలుగుతుందని అని హిందూవుల నమ్మకం.
మన దేశంలో సంభవించిన ఈ తొలి సూర్యగ్రహణం ఏటా వచ్చే గ్రహణాల కింద పరిగణించాలని న్యూఢిల్లీలోని నెహ్రూ ప్లానెటోరియం అధికారులు తెలిపారు. సంపూర్ణగ్రహణానికి భిన్నంగా ఈ సూర్యగ్రహణం 20 శాతం మాత్రం ప్రజలకు కన్పిస్తుంది.