కోటి వరాలపై అసెంబ్లీని సమావేశపర్చాలి
విశాఖపట్నం: కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతబడ్జెట్ లో మార్పులు చేయాలంటే మరోసారి ప్రత్యేకంగాఅసెంబ్లీని సమావేశపర్చాలని సీఎల్పీ నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. సంక్షేమ వరాలు గుప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటికి తెచ్చే నిధులపై సమగ్రంగాఅసెంబ్లీలో చర్చించాలన్నారు. రెండు నెలల క్రితమే శాసనసభలోబడ్జెట్ ను ప్రవేశపెట్టారని, మరి అప్పుడే ఈ సంక్షేమ పథకాలను ఎందుకుబడ్జెట్ లో చేర్చలేదని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ చేపట్టిన ప్రజాప్రస్థానం తర్వాతే బాబు సంక్షేమ జపం జపిస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు.బడ్జెట్ లో మార్పులకు అసెంబ్లీనే తగిన వేదికని ఆయన శనివారంవిశాఖపట్నం జిల్లాలో అన్నారు. విశాఖపట్నం కె.జి ఆసుపత్రి వైద్యులు వై.ఎస్. ఆరోగ్యం పక్కాగా ఉందని సర్టిఫికేట్ ఇవ్వడంతో ఆయన మూడో రోజు ఈ జిల్లాల్లో తన ప్రజాప్రస్థానాన్ని కొనసాగించారు.
ఉదయం నర్సీపట్నం దగ్గరి వడ్డేపల్లిలో ప్రారంభించిన యాత్ర చోడవరం మండలం కొత్తగూడెంలో ముగించారు. టీడపీ నేతలు అనతి కాలంలోనేసైకిల్ నుంచి మారుతీ కార్ల వరకు ఎదిగారని, ప్రజలకు ఇప్పుడు కొత్తగాసైకిళ్ళు ఇస్తామని మురిపిస్తున్నారని ఆయన ఘాటుగావిమర్శించారు.