వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఛలో పరగోడు రాజకీయ లబ్దికే: ఎమ్మెస్
హైదరాబాద్: ఛలోపరగోడు అంటూ తెలుగుదేశం పార్టీ చేపట్టనున్న కార్యక్రమం కేవలం రాజకీయ లబ్ది కోసంమినహా సమస్యపై చిత్తశుద్దితో కాదని రాష్ట్ర కాంగ్రెస్విమర్శించింది. పరగోడుపై ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం ఇప్పుడు పరువు దక్కించుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పైవిమర్శలు చేస్తూ, ప్రజాకర్షక యాత్రలను చేపట్టాలని యోచిస్తోందనిపీసీసీ అధ్యక్షుడు ఎం.సత్యనారయణ రావు ఎద్దేవా చేశారు.
కేంద్రప్రభుత్వంలో భాగస్వామిఅయిన టీడీపీ కర్ణాటకపై ఒత్తిడి తీసుకొచ్చేలా కేంద్రాన్ని ఎందుకు డిమాండ్ చేయదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలుఅంతా రాష్ట్ర ప్రయోజనాలకే కట్టుబడి ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ నేతలవిమర్శలు అర్ధరహితమని ఎమ్మెస్ కొట్టిపారేశారు.పరగోడుపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Story first published: Monday, June 2, 2003, 23:53 [IST]