వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మజ్లీస్ ఎమ్మెల్యే సజ్జాద్ మృతి
హైదరాబాద్: హైదరాబాద్లోనికార్వాన్ శాసనసభ్యుడు సయ్యద్ సజ్జాద్ సోమవారం హృద్రోగంతో మరణించారు. ఆయన మజ్లీస్ పార్టీ అభ్యర్థిగా 1999లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయనకు 50 ఏళ్లు.
సజ్జాద్ గత కొంతకాలంగా మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారు. దాంతో పాటు హృద్రోగం కూడా ఆయనను బాధిస్తోంది. ఆయన మొదటిసారి మజ్లీస్ తరఫున ఆసిఫ్నగర్ నియోజకవర్గం నుంచి 1989లో శాసనసభకు ఎన్నికయ్యారు. సోమవారం బజార్ఘాట్లోని ఆయన నివాసంలోఆస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను మొజంజాహీ మార్కెట్ వద్ద గల ఒక ఆస్పత్రిలో చేర్చారు. ఆ ఆస్పత్రితో ఆయన తుదిశ్వాస విడిచారు. సజ్జాద్ మృతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మజ్లీస్ అధినేత సల్లావుద్దీన్ ఓవైసీ సంతాపం ప్రకటించారు.
Comments
Story first published: Monday, June 2, 2003, 23:53 [IST]