వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛలో పరగోడుకు నేనూ వస్తా: వైఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ నేతలు తలపెట్టిన ఛలోపరగోడుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వం వహించాలనిసీఎల్పీ నేత వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. టీడీపీ సామాన్య నేతల చేపట్టదల్చుకొన్న ఈ కార్యక్రమం హింసాత్మకంగా మారే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.విశాఖ జిల్లాలో ఆయన తన పాదయాత్రలో భాగంగా ఆయన సోమవారంవిలేకరులతో మాట్లాడారు.

ముఖ్యమంత్రితో పాటు తానూ వస్తానని,అందుకు బాబు సిద్దం కావాలని వై.ఎస్‌ పిలుపునిచ్చారు.సీఎం, ఆయన క్యాబినెట్‌ సహచరులు ఇందులో పాల్గొంటే కాంగ్రెస్‌ ముఖ్యనేతలుఅందరూ స్వచ్చందంగా పాల్గొంటారని ఆయన అన్నారు.

పరగోడు ప్రాజెక్ట్‌ నిర్మాణం ఆగిపోయేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయనకోరారు. ప్రజాప్రస్థానంలో భాగంగా స్థానిక సమస్యలను ఆయన తెలుసుకున్నారు. రైవాడ నీటిని వదలకపోవడం వల్లవిశాఖజిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులుకు గురవుతున్నారని ఆయనవిమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X