వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎండలు: రాష్ట్రంలో మృతులు వెయ్యికిపైనే
హైదరాబాద్: ఈ వేసవిలో భానుడు ఇంకా ప్రతాపంచూపిస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో దాదాపు 100 మందికి పైగా ఎండలతాకిడికి మరణించినట్లు అధికారులు అంచనావేస్తున్నారు. మంగళవారం నాటికి రాష్ట్రంలోఎండల తీవ్రతకు మరణించిన వారి సంఖ్య 1000దాటింది. నల్గొండ, తూర్పు గోదావరి, గుంటూర్జిల్లాల్లో మృతుల సంఖ్య అధికంగా ఉంది.
గత రెండు రోజులుగా మరింతఎండలు ముదరడంతో ప్రజలు తీవ్రంగాఇబ్బంది పడుతున్నారు. మరో నాలుగు రోజుల పాటుఎండలు ఇలానే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖవర్గాలు తెలిపాయి. ఈ నెల 8, 9 తేదీల్లో రుతుపవనాలు కేరళనుదాటే అవకాశం ఉందని మంగళవారం న్యూఢిల్లీలోనికేంద్రీయ వాతావరణ పరిశోధనా కేంద్రంప్రకటించింది. మరోవైపు, మధ్యాహ్నం పూటరాష్ట్రంలో కర్ఫ్యూలాంటి వాతావరణం నెలకొంది.హైదరాబాద్ లో మధ్యాహ్నం పూటరోడ్లన్నీ ఖాళీనే.
Comments
Story first published: Tuesday, June 3, 2003, 23:53 [IST]