వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సోనియా జోక్యం డిమాండ్అర్ధరహితం
విజయనగరం: పరగోడు ప్రాజెక్ట్ పరిష్కారం ఏఐసిసిఅధ్యక్షురాలు సోనియాగాంధీ చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగాఉందని సీఎల్పీ నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిఅన్నారు.
అసలు పరగోడు విషయంలోసోనియా జోక్యం చేసుకోవాలన్న ప్రశ్నే ఉత్పన్నంకాదని ఆయన సోమవారం విజయనగరంజిల్లాల్లో పేర్కొన్నారు. కోర్టులు, చర్చలు ద్వారాపరిష్కరించుకోవాల్సిన విషయాన్ని తెలుగుదేశంనాయకులు రాజకీయ లబ్ది కోసం అర్ధరహితమైనవ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్డీఏ సర్కార్ కుమద్దతిస్తోన్న బాబు కేంద్రంపై ఒత్తిడితీసుకురావాల్సింది మాని, ప్రతిపక్ష నేత జోక్యంచేసుకోవాలనడం ఏ విధంగా సబబు అని ఆయనప్రశ్నించారు. మరోవైపు, కాంగ్రెస్ నేతజె.సి.దివాకర్ రెడ్డి కూడా చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబట్టారు.
Story first published: Tuesday, June 3, 2003, 23:53 [IST]