నేను నిర్ధోషిని: భూకబ్జా నేత వడ్డేపల్లి
హైదరాబాద్: కొంతమంది పోలీసుఅధికారులు రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో తనపై కక్ష గట్టివేధిస్తున్నారని భూకబ్జా కేసులో మూడు రోజుల క్రితంఅరెస్ట్ అయిన ఏ.ఐ.సి.సి సభ్యుడు వడ్డేపల్లినర్సింగరావు ఆరోపించారు. మంగళవారం ఆయన బెయిల్ పైవిడుదలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్ననర్సింగరావు విలేకరులతో మాట్లాడుతూ పోలీసులు తనను బెయిల్ కూడా తీసుకోనివ్వకుండావేధించారని, తనపై నమోదు చేసినకేసుల్లో నిజం లేదని చెప్పారు.
సాక్ష్యాలు లేకుండానే తనపై కేసుపెట్టడంలోనే ఇది రాజకీయ కుట్ర అని అర్థమవుతోందనిఆయన అన్నారు. ఎవరికీ తాను ఒకే భూమిని ఇద్దరికీఅమ్మలేదని ఆయన స్పష్టం చేశారు. తాను నిర్ధోషిననివడ్డేపల్లి పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతోన్న వడ్డేపల్లిని పీసీసీ అధ్యక్షుడుఎం.సత్యనారయణ రావు సందర్శించి,పరామర్శించారు. చంద్రబాబు నాయుడు రాజకీయకుట్రతో వడ్డేపల్లిపై కేసులు పెట్టినట్లుఆయన ఆరోపించారు. ఈ కేసుపై పార్టీ పరంగా ఓ నిజనిర్ధారణ కమిటీనిపీసీసీ నియమించింది. కమిటీ నివేదిక అందిన తర్వాతేతాము ప్రభుత్వంపై పోరాడుతామని ఎమ్మెస్ తెలిపారు.