వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాజ్పేయి నాయకత్వంలోనే పోరు: వెంకయ్య
న్యూడిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికలను ప్రధాని వాజ్పేయి నాయకత్వంలో, ప్రభుత్వ పనితీరుపై ఆధారపడి ఎదుర్కోనున్నట్లు భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ నేతృత్వంలో బిజెపి ఎన్నికల బరిలోకి దిగుతుందని ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి చేసిన ప్రకటన నేపథ్యంలో వెంకయ్యనాయుడు గురువారం ఆ విధంగా చెప్పారు.
వాజ్పేయి ప్రకటన నేపథ్యంలో వెంకయ్యనాయుడు గురువారం పార్టీ కార్యాలయంలో కేంద్ర ఆఫీస్ బియరర్లతో సమావేశమయ్యారు. ప్రధాని చేసిన ప్రకటనలోని అప్రధానమైనవిషయాన్ని పెద్దగా చేసి చూపారంటూ వెంకయ్యనాయుడు మీడియాపై విరుచుకుపడ్డారు. ఆయన తన ఆగ్రహాన్నివిలేకరుల వద్ద వ్యక్తం చేశారు. వెంకయ్యనాయుడు గురువారం ఉదయం ప్రధాని వాజ్పేయితో ఈవిషయాలపై మాట్లాడినట్లు సమాచారం.
Story first published: Thursday, June 5, 2003, 23:53 [IST]