వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర తోడ్పాటుతోనే టూరిజం అభివృద్ధి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉంటేనే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. దక్షిణాది రాష్ట్రాల పర్యాటక మంత్రుల ద్వితీయ సమావేశాన్ని ఆయన గురువారం ప్రారంభించారు.

పర్యాటక రంగానికి మంచి భవిష్యత్తు ఉన్నదని, అయితే కేంద్ర సహకారం ఉంటేనే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని కూడా ఆయన అన్నారు. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ తర్వాత భవిష్యత్తు పర్యాటక రంగానిదేనని ఆయన అన్నారు. పర్యాటక రంగం అభివృద్ధివిషయంలో దక్షిణాది రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరమని, ఈ రాష్ట్రాల మధ్య ప్యాకేజీ టూర్లు ఉండాలని ఆయన అన్నారు.

పర్యాటక రంగం అభివృద్ధికి ఓపెన్‌ స్కై పాలసీ అవసరమని, ఓపెన్‌స్కై పాలసీ వల్ల విమానాల రాకపోకలు పెరిగి పర్యాకుల సంఖ్య పెరుగుతుందని, ఈవిషయమై తాను కేంద్రంతో మాట్లాడతున్నానని ఆయన చెప్పారు. ప్రత్యేక పర్యాటకరైలును ప్రవేశపెట్టే విషయం గురించి కూడా ఈ సమావేశంలో మాట్లాడారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X