వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్ర ఉద్యోగులకు కరవు భత్యం
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డిఎ) విడుదల చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రి వర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
తిరుపతి మహానాడులో వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలపై మంత్రి వర్గం విస్తృతంగా చర్చించింది. కరువు ప్రాంతాల్లోని రైతులకు 600 కోట్ల వడ్డీ రాయితీ ఇవ్వాలని కూడా మంత్రి వర్గం నిర్ణయించింది. మహానాడులో ఇచ్చిన హామీలకు సంబంధించిన కొన్నింటికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. బడుగు వర్గాలకు, రైతులకు, రిక్షాకార్మికులకు ఇచ్చిన హామీలు ఇందులో ఉన్నాయి. కరువు ప్రాంతాల్లోని ప్రజలకు రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించేవిషయంపై కూడా చర్చ జరిపింది.
Comments
Story first published: Thursday, June 5, 2003, 23:53 [IST]