వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మరో రైలు ప్రమాదం- ఇద్దరు మృతి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో గురువారంనాడు ప్యాసింజర్ రైలు ట్రక్ను ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ఆదిలాబాద్కు 20 కిలోమీటర్ల దూరంలో జరిగింది.
ఆదిలాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరిన ముద్ఖేడ్ ప్యాసింజర్రైలు ట్రాక్ పునరుద్ధరణలో పనులకు నియోగించిన ట్రక్ను ఢీకొన్నది. దీంతో ప్యాసింజర్రైలుకు చెందని ఐదు కోచ్లు పట్టాలు తప్పాయి. ఇందులో రెండు కోచ్లు ఎడమ వైపు పడిపోయాయి. దీంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. గాయపడినవారిని ఆదిలాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ట్రక్ డ్రైవర్ పొరపాటు వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు.
Comments
Story first published: Thursday, June 5, 2003, 23:53 [IST]