వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలీసు స్టేషన్నుపేల్చేసిన నక్సల్స్
అనంతపురం: నిషిద్ధ పీపుల్స్వార్ నక్సలైట్లు గురువారంనాడు అనంతపురం జిల్లా రొడ్డం పోలీసుస్టేషన్ను పేల్చివేశారు. కడప ఎన్కౌంటర్లకు నిరసనగా తాము పోలీసుస్టేషన్ను పేల్చి వేసినట్లు వారు చెప్పుకున్నారు.
పోలీసు స్టేషన్కు చెందిన ఎఎస్ఐని, కానిస్టేబుళ్లను బంధించి, వారిని తాళ్లతో కట్టేసి పోలీసుస్టేషన్ను పేల్చేశారు. దాదాపు 17 మంది సాయుధ నక్సలైట్లు ఈ సంఘటనలో పాల్గొన్నారు. బకెట్లలో పేలుడు పదార్థాలను పోలీసుస్టేషన్లో ఉంఇచ పేల్చి వేశారు. అనంతరం వారు ఒకలేఖను ఎఎస్ఐకి ఇచ్చిపోయారు. 20 మంది పోలీసులు పని చేయాల్సిన పోలీసుస్టేషన్లో ఆరుగురు మాత్రమే ఉండడం వల్ల నక్సలైట్లను ఎదుర్కోలేకపోయినట్లు చెబుతున్నారు.
Comments
Story first published: Thursday, June 5, 2003, 23:53 [IST]