ఒబిసి జాబితాలో ఆంధ్ర తూర్పు కాపులు
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లోని కొన్ని కొత్త కులాలను, వర్గాలను కేంద్ర ఇతర వెనుకబడిన తరగుతుల (ఒబిసి) జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రి వర్గం గురువారం నిర్ణయించింది. ఢిల్లీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని కులాలు, వర్గాలు కొత్తగా ఒబిసి జాబితాలో చేరేవాటిలో ఉన్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అధ్యక్షతన గురువారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనివిజయనగరం జిల్లాలో గల తూర్పు కాపులను ఒబిసి జాబితాలో చేర్చాలని మంత్రి వర్గం నిర్ణయించింది. కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో గల గౌడలను, రాజస్థాన్లోని సోంపురా ముర్తికార్మినహా సిలావట్లను, ఢిల్లీలోని జులాహా- అన్సారీ, ఇద్రిషి, నద్దాఫ్, మన్సూరి, సాల్మనీలను ఒబిసి జాబితాలో చేర్చాలని నిర్ణయం తీసుకుంది.