వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్‌కు వడదెబ్బ- ఆగని యాత్ర

By Staff
|
Google Oneindia TeluguNews

విజయనగరం: పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డికి మళ్లీ వడదెబ్బ తగిలింది.అయినా ఆయన పాదయాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్‌ ప్రకటించింది.

రాజశేఖర్‌ రెడ్డి గురువారంనాడువిజయనగరం జిల్లాలోని చిన్నాపురం ఉంచి పూల్‌బాగ్‌ వరకు నడిచారు. వడదెబ్బ తగలడంతో,పెద్ద యెత్తున ప్రజలు రావడంతో శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బంది ఏర్పడింది.విజయనగరం పట్టణంలో ఎండ వేడితో ఆయనకు విపరీతంగా చెమటలు పట్టాయి.అయినప్పటికీ ఆయన రెండు చోట్ల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పూల్‌బాగ్‌ వద్దకు చేరుకున్న తర్వాత ఆయన ఎవరితోనూ మాట్లాడలేకపోయారు. దీంతో ఆయన విశ్రాంతి తీసుకున్నారు. వ్యక్తిగత సిబ్బంది పరిచర్యలతో ఆయన సాయంత్రానికి కొద్దిగా కోలుకున్నారు. ఆయన గురువారం సాయంత్రం తన పాదయాత్రను కొనసాగించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X